Saturday, November 25, 2017


University of California, Berekeley

అమెరికాలో “ధన్యవాదాలు తెలుపుకునే పండుగ” – Thanks Giving సందర్భంగా

అమెరికాలో  తెలుగు పీఠం (బర్^క్లీకాలిఫోర్నియా లో) ఆవశ్యకత...మీ సత్వర సహాయానికి అభ్యర్ధన...

పరాయి దేశంలో మాతృభాషకి పెద్ద పీట వేసి ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం చెయ్యగలిగినది మనం చెయ్యడమే మన కర్తవ్యం.
నేపధ్యం

అమెరికా విశ్వవిద్యాలయాలలో తెలుగు పీఠం నెలకొల్పాలి అనే ఆలోచన ఇప్పటిది కాదు. 1998 లో అట్లాంటాలో జరిగిన మొట్ట మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సులో తన కీలకోపన్యాసం లో వెల్చేరు నారాయణ రావు గారు తెలుగు భాష సాహిత్యాలని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడం ఇక్కడ విశ్వవిద్యాలయాలలో తెలుగు పీఠాలు నెలకొల్పి ఆయా ఆచార్యులు, అంతర్జాతీయ విద్యార్థుల పరిశోధనల ద్వారా మాత్రమే సాధ్యం అని స్పష్టంగా వివరించారు. డా. గవరసాన సత్యనారాయణ గారు గణాంకాలతో సమగ్రమైన ప్రసంగం చేసి అమెరికాలో విదేశీ భాషగా తెలుగుని గుర్తించడానికి “అమెరికాలో తెలుగు భాష వ్యాప్తి, బోధన, పరిశోధన, ఆధునీకరణలకు వీలుగా తెలుగు పీఠమును స్థాపించ వలయును”  అనే ఏక వాక్య తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆ తీర్మానాన్ని పెమ్మరాజు వేణుగోపాల రావు గారు, వేమూరి వెంకటేశ్వర రావు గారు, వంగూరి చిట్టెన్ రాజు సమర్థించగా “అట్లాంటా తీర్మానము” అనే పేరిట అది ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఆ నాడు అమెరికాలో తెలుగు పీఠం అవసరం పై చర్చించిన విషయాలు ఇప్పటికీ, ఎప్పటికీ అర్థవంతవయినవి, ఆచరణ లో పెట్ట దగ్గవే. కొంత వరకూ ఆచరణ లోకి వచ్చినవి అన్నీ చాలా మటుకు వ్యక్తిగత ప్రయత్నాలే.
ప్రస్తుత విషయం
ఆ నాటి వేమూరి వేంకటేశ్వర రావు గారు కేవలం మాటలతో కాకుండా చేతలతో అమెరికాలో తెలుగు పీఠం సంస్థాపన లో పదేళ్ళు వ్యక్తిగతంగా, నిస్వార్ధంగా ఎంతో కృషి చేసి 2006 వ సంవత్సరం లో బెర్క్ లీ లో ఉన్న ప్రతిష్టాత్మకమైన కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం ఏర్పాటు చేశారు. ఆ పీఠాన్ని ఇప్పుడు మరింత పటిష్టమూ, శాశ్వతమూ చెయ్యవలసిన కర్తవ్యం నాదీ, మీదీ, మన తెలుగు శాఖని అభివృద్ది పరిచే విషయం మీద ఆ విశ్వ విద్యాలయం లో తెలుగు శాఖ అంతర్భాగం గా ఉన్న South Eastern & South Asia విభాగం ప్రొ. సుచిత సక్సేనా మరియు డైరెక్టర్ ప్రొఫెసర్ మారిస్ ఫరుకీ లతో నేను స్వయంగా కూలంకషంగా చర్చించాను.  సంక్షిప్తంగా చెప్పాలంటే ఇప్పటి దాకా డా. వేమూరి గారి ఏకైక అకుంఠీత దీక్ష వలన ఈ క్రింది విజయాలు సమకూరాయి. ఆయనతో సహకరిస్తూ ఆ పీఠాన్ని మరింత బలపరిచి మున్ముందుకు తీసుకు వెళ్ళవలసిన బాధ్యత మనందరిదీ. యావత్ ప్రపంచంలోనే అతి పెద్ద , అగ్రస్థాయి విశ్వ విద్యాలయాలలో ఒకటైన కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం బెర్కేలీప్రాంగణం లో మన తెలుగు పీఠం వెళ్లి విరియడం తెలుగు వారికి గర్వ కారణం.  
సాధించిన పురోగతి: సంక్షిప్తంగా:
 ·         2006 నుంచి అమెరికాలోబర్^క్లీ లో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో గత పదేళ్లుగా తెలుగు భాషా బోధన - సగటునఏడాదికి రెండు పాఠ్యాంశాలు చొప్పున -జరుగుతోంది. ఒకటి ప్రారంభ తరగతులు. రెండోది మధ్య తరగతులు.
·         తెలుగులో పరిశోధన నిమిత్తం TELSA (దక్షిణ కేలిఫోర్నియాలో ఉన్న ఒక తెలుగు సంఘం) వారు ఇచ్చిన $50,000 తో విద్యార్థి వేతనం కూడా గత ఏడాది నుండి మొదలు అయింది. ఇది కేవలం ఓనమాలు నేర్పించడం కోసం తలపెట్టిన పీఠం కాదు. ఇది కేవలం బర్కలీ ప్రాంగణానికి పరిమితం చెయ్యాలని  తలపెట్టిన పీఠమూ  కాదు. 
·         ఈ పీఠం ఈ  రోజు ఉండిరేపు మూత పడిపోయే వానకాలపు పీఠం కాదుసుస్థిరంగాశాశ్వతంగా నిలవగలిగే స్తోమత సంపాదించుకున్న పీఠం. ఇది తెలుగువారు అంతా కలిసిఉడతా భక్తితోచిన్నా, పెద్దా విరాళాలు ఇచ్చి నిలబెడుతున్న పీఠం! ఏ ఒక్క కుటుంబానికో చెందినది కాదు.
·         వేమూరి గారి నాయకత్వంలో ధన సేకరణ 2006 లో మొదలయింది. అనేక ప్రాంతాల నుండి మిత్రులు నిధులు పోగు చేసి పంపుతూనే ఉన్నారు. ఇప్పటికి $675,000 వరకు నిధుల పోగు చెయ్యడం జరిగింది. ఖర్చులు పోను ప్రస్తుతం శాశ్వత నిధిలో $477,000 ఉన్నాయి. 
మీకు ప్రత్యేక అత్యవసర విన్నపం
బెర్క్ లీ లో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం లో ఉన్న తెలుగు పీఠం నిర్వాహకుల నిర్దేశం ప్రకారం ఇప్పుడు ఉన్న $477,000 నిదులకి మనం కేవలం మరొక $25, 000 జమ చెయ్యగలిగితే ఆ పీఠానికి మరింత బలం చేకూరుతుంది. ఆ విశ్వ విద్యాలయం ఉన్నన్నాళ్లూ....అంటే వందల సంవత్సరాలు ..అమెరికాలో భావి తరాల తెలుగు, తెలుగేతర విద్యార్థులకీ అక్కడ తెలుగు భాషా బోధన నిరాటంకం గా సాగుతుంది.
మీరు ఇచ్చే విరాళానికి వంగూరి ఫౌండేషన్ వారు, వేణు ఆసూరి గారు చెరొక $5000 వరకూ జత పరుస్తారు. They will match your donation up to $5000 each. ...this year… 2017.
  
అందు వలన ఈ ఏడాది ఆఖరు లోగా...అనగా డిశెంబర్ 31, 2017 లోగా మనం సమిష్టిగా కనీసం $25,000 నిధులు సేకరించి ఆ విశ్వవిద్యాలయానికి అందజేసి ఈ తెలుగు పీఠానికి శాశ్వత స్థాయి కలిగించడానికి మీ ఉదార విరాళాలు అభ్యర్థించడమే ఈ ఉత్తరం సారాంశం. కావలసిన స్థాయికి చేరడానికి ఇచ్చిన వారు మరొక సారి ఇవ్వాలి. కొత్తవారు ఈ క్రతువులో ఉత్సాహంగా పాల్గొని ఈ పనిని పూర్తి చెయ్యాలి.

Donor Recognition by U C, Berkeley
(దాతల గుర్తింపు)
The University has different levels of recognizing donor contributions from very small amount to substantial amounts. .
విరాళం ఎంతా అనే దానితో సంబంధం లేకుండా దాతలు అందరికీ గుర్తింపు మూడు స్థాయిలలో ఉంటుంది.  
One of the most popular category is a special recognition on its web page by South East & South Asian Department for all donors of $5000 or more payable over several years. We strongly encourage your participation in this plan. Again, no amount is too small. 
Suggested Donation Amounts for 2017
$100 to $25,000
How to Donate
Suggested Option 1-
(All donations through VFA are tax-deductible in USA.
(Federal Tax ID: 76-044238)
(All donations qualify for matching funds up to $10,000 from VFA & Venu Asuri)
How this works
You send your donation in any amount on-line or by check as given below. VFA will match your donation up to $5.000 in 2017. In addition, as VFA is qualified to receive matching donations from many companies and you can also apply for a matching donation from your employer.
 VFA will send your contribution & your company match to UC Berkeley Foundation for Telugu Studies in YOUR name.
 You will get a receipt from UC, Berkeley and will be recognized by UC per their policies (attached) and by VFA in its communications on FB and Google member group.   
Donation through VFA on-line using any credit card.
Please click on the following link and donate generously using any credit card.
or
 make check payable to Vanguri Foundation and mail to:
VFA, P.O. Box 1948, Stafford, TX 77497 
Suggested Option 2
Donate Direct to UC, Berkeley Foundation
You can donate on-line directly to University of California, Berkeley by clicking on the following link

or please fill the attached Pledge Card and send it directly to UC, Berkley as instructed.

Please donate generously to support Telugu Studies at the prestigious University of California, Berkeley.

For More Details, Please contact the following:

Prof. Rao Vemuri 
Phone: 650 793 8458: E-mail:  rvemuri@gmail.com

Vanguri Chitten Raju

 ఎందరో తెలుగు విద్యాదాన కర్ణులు.. అందరికి వందనాలు!!



Monday, November 20, 2017





దిగ్విజయంగా ముగిసిన 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు & మొట్టమొదటి అమెరికా మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం….సమగ్ర నివేదిక

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) సంయుక్త నిర్వహణలో అమెరికా రాజధాని వాషింగ్టన్ DC లో
..సెప్టెంబర్ 23-24, 2017 లలో జరిగిన 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు  అఖండ విజయం సాధించింది. ఒకరా, ఇద్దరా....154 మంది ప్రతినిధులు రెండు రోజులలో సుమారు 15 గంటల సేపు తెలుగు భాష సాహిత్యానందంతో జేవిత కాలం గుర్తుంచుకునే అనుభూతి పొందారు.  భారత దేశ నుంచి వచ్చిన పది మంది సాహితీవేత్తలు,   అమెరికాలో అనేక నగరాల నుంచి వచ్చిన సుమారు 30 మంది అమెరికా తెలుగు రచయితలు, 30 మంది స్థానిక తెలుగు ఉపాధ్యాయులు, ఇతర భాషా ప్రియులు, సాహిత్యాభిమానులతో సభా ప్రాంగణం కళ కళ లాడింది.
    
ముందుగా సుధారాణి కుండపు, కె. గీత మరొక గాయని ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ వేయగా సుప్రసిద్ధ అమెరికా రచయిత్రి సుధేష్ణ సోమ, మరొక ఇద్దరు మహిళలు జ్యోతి ప్రజ్వలన చేసి శుభారంభం చేశారు. రాజధాని ప్రాంతీయ సంఘం అధ్యక్షులు భాస్కర్ బొమ్మారెడ్డి ప్రతినిధులకి సాదరంగా స్వాగతం పలికి ఆహ్వానిత  అతిధులయిన కవి జొన్నవిత్తుల, శతావధాన శిరోమణి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ, దీవి సుబ్బారావు, జంధ్యాల జయకృష్ణ బాపూజీ, పద్మ వల్లి గార్లను వేదిక మీదకి ఆహ్వానించారు. వంగూరి చిట్టెన్ రాజు ప్రారంభ సభని నిర్వహించారు.

తన ప్రారంభోపన్యాసంలో శాస్త్రీయ పరమైన నిరూపణల తో తెలుగు భాష ప్రాచీనతని విశదీకరించారు. పాలపర్తి వారు అచ్చ తెనుగు ప్రాధాన్యత ని వివరించారు. దీవి సుబ్బారావు కావ్య ధర్మం మీద సాధికార ప్రసంగం చేశారు. జంధ్యాల బాపూజీ గారు తన తండ్రి కరుణశ్రీ గారి కవిత్వం మీద ఆసక్తి కరమైన ప్రసంగం చేశారు. అమెరికా యువ సాహితీ వేత్త పద్మవల్లి వేదిక మీద ప్రసంగించడం ఇదే తొలి సారి అని ప్రస్తావించి, కథా వస్తువులలో తెలుగు వస్తువులలో ఉన్న వైవిధ్యతా లోపాలు వివరించి, అనేక ఇతర భాషలలో వస్తున్న కొత్త కథా వస్తువులని సోదాహరణం గా వివరించి కథకులకి మంచి సూచనలతో కీలకోపన్యాసం చేశారు. ప్రధానోపన్యాసం చేసిన కవి జొన్నవిత్తుల ఈ నాటి యువ తరం రామాయణం ఒక మత గ్రంధంలా కాకుండా సమాజంలో రాముడు, సీత మొదలైన వారి  విశిష్ట వ్యక్తిత్వాలు ఈ నాటి సమాజంలో వాటి ఆవశ్యకత వివరించారు.  

ప్రారంభ సభ అనంతరం బద్రీనాథ్ చల్లా నిర్వహణలో వాషింగ్టన్ DC ప్రాంతంలో పిల్లలకి తెలుగు బోధిస్తూ నిస్వార్తంగా భాష సేవ చేస్తున్న 30 మంది ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమం అందరి మన్ననలూ పొందింది. తరువాత శాయి రాచకొండ నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో 13 తెలుగు పుస్తకాలు (వంగూరి ఫౌండేషన్ ప్రచురణలైన అమెరికా తెలుగు కథానిక -13, సుధేష్ణ సోమ రచించిన నర్తకి, ఉమాభారతి నవల వేదిక, విన్నకోట రవిశంకర్ వ్రాసిన కవిత్వంలో నేను, దశిక శ్యామలా దేవి అమెరికా ఇల్ల్లాలి ముచ్చట్లు -2), జీవనయానంలో రసాయనాలు-చాగంటి కృష్ణ కుమారి, మూడు నగరాలు-దాసరి అమరేంద్ర, నీవు లేక- M. గీతావాణి, మిమ్మల్ని ఇక్కడదాక చేర్చింది అక్కడకి చేర్చదు -నౌడూరి మూర్తి, కుందాపన-రవి వీరెల్లి, ఆత్మానందం, ఆత్మారామం - రామ్ డొక్కా, చుక్కల్లో చంద్రుడు - వేమూరి వెంకటేశ్వర రావు, “అమ్మ కోరిక” సినిమా DVD: ఫణి డొక్కా) వైభవంగా ఆవిష్కరించబడ్డాయి. రచయితల తరఫున సుధేష్ణ సోమ సముచిత ప్రసంగం చేశారు.

భోజన విరామం తరువాత సుధారాణి కొండపి నిర్వహించిన మహిళా రచయితల ప్రత్యేక వేదికలో, శారదా పూర్ణ (ఆధునికాంధ్ర సాహిత్య వ్యక్తిత్వం), చాగంటి కృష్ణకుమారి (నేనూ, నా తల్లి భాష తెలుగు), భారత దేశం నుంచి వచ్చిన సుప్రసిద్ద స్త్రీవాద రచయిత్రి విమల (మారుతున్న సమాజం - స్త్రీవాద రచనలు), ఉమా భారతి (ప్రదర్శన కళలకి సంబంధించిన సాహిత్యం), పాలపర్తి ఇంద్రాణి (కళ -ప్రయోజనం), కల్పన రెంటాల (కొన్ని సమయాల్లో కొందరు స్త్రీలు), గోపరాజు లక్ష్మి (గమనమే గమ్య) కె. గీత (అమెరికా తెలుగు కవయిత్రులు ఏం రాసారు? ఏం రాస్తున్నారు? ఏం రాయాలి?) మంచి ప్రసంగాలు చేశారు. తరువాత ప్రసంగ వేదిక ప్రసాద్ చరసాల నిర్వహణ లో అఫ్సర్ (కథ-కథనం- ప్రయోగం), గరిమెళ్ళ నారాయణ (వంగూరి చిట్టెన్ రాజు గారి కధలు: వర్తమాన మరియు భవిష్యత్ ఆవశ్యకత), ఎస్. నారాయణ స్వామి (అమెరికా తెలుగు కథలో భారతీయులు కాని వారితో సంబంధ బాంధవ్యాలు) పాల్గొన్నారు.   
మొదటి రోజు ఆఖరి అంశంగా సదస్సు నిర్వాహకులైన వంగూరి చిట్టెన్ రాజు, భాస్కర్ బొమ్మారెడ్డి,  ఆహ్వానిత అతిధులు సుప్రసిద్ద అమెరికా సాహితీ వేత్తలు డా. శారదా పూర్ణ & డా. శ్రీరామ్ శొంఠి,  జె. కె. మోహన రావులను జీవన సాఫల్య పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
మొదటి రోజు సదస్సు అనంతరం భారత దేశం నుంచీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిదులకి CATS వారు సుధారాణి కుండపు గారి సౌజన్యంతో వారి ఇంట్లో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఫణి డొక్కా దర్సకత్వం వహించిన తాజా తెలుగు చిత్రం “అమ్మ కోరిక” ప్రదర్శించారు.

రెండవ రోజు (సెప్టెంబర్ 24) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దాసరి అమరేంద్ర (కొత్త కథకులు), తాడికొండ శివకుమార శర్మ (తెలుగు కథలు-.స...లు), విన్నకోట రవిశంకర్ (ఆదిలో ఒక పద్య పాదం), వైదేహి శశిధర్: కవిత్వం (నా ఆలోచనలు), నిషిగంధ (కవిత్వం-ధ్వనిప్రతిధ్వని), రవి వీరెల్లి( కొత్త కవిత్వానికి కొత్త భాష అవసరమా?), నారాయణ స్వామి వెంకటయోగి: (అమెరికా తెలుగు కవిత్వంలో సామాజికాంశాలు), వేదుల వెంకట చయనులు (తాతగా సాహస సాహితీ ప్రక్రియ), వేమూరి వెంకటేశ్వర రావు (మాలతీ చందూర్ -నా అభిమాన రచయిత్రి), డా. గీత వాణి (స్మృతి కావ్యాలు -వస్తు నవ్యత), జె.కె. మోహన రావు (పద్యాలు వ్రాయుటకు సులువుగా ఒక పద్య ఫలకము), K.S. రామచంద్ర రావు (మన సినిమాలలో తెలుగు సాహిత్యం) రామ్ డొక్కా(ఆత్మ శ్రావ్య కవిత్వం), ఇన్నయ్య నరిశెట్టి (తెలుగులో శాస్త్రీయ సాహిత్యం ఆవశ్యకత), హెచ్చార్కె(సాహిత్య రాజకీయం-రాజకీయ సాహిత్యం), వేణు వింజమూరి (కథ చెబుతా, వింటారా?) పాల్గొన్నారు. ఈ వేదికలను ఎస్. నారాయణ స్వామి, శాయి రాచకొండ సమర్థవంతంగా నిర్వహించారు.  

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్క్లీ, లో నెలకొల్పబడ్డ తెలుగు పీఠం వివరాలతో ఆ పీఠాన్ని ఆర్ధికంగా సమర్థించి శాశ్వత స్థాయి కలిగించాలి అని వేలూరి వెంకటేశ్వరరావు అమెరికా తెలుగు వారు అందరికే విజ్ఞప్తి చేశారు. ఛందస్సు శాస్త్రం మీద జె.కె. కృష్ణ మోహన రావు గారి సాధికార ప్రసంగం తలమానికంగా నిలిచింది.

మరొక చెప్పుకోదగ్గ విజయం పుస్తక విక్రయశాలలో సుమారు 75 తెలుగు పుస్తకాలు చోటు చేసుకున్నాయి.  

ఆఖరి వేదిక గా స్వీయ రచనా పఠనం వేదికలో శ్యామలా దేవి దశిక, రాజేశ్వరి దివాకర్ల, లెనిన్ వేముల, ఇ.వి. రామస్వామి, నేమాని సోమయాజులు పాల్గొన్నారు. సమయాభావం వలన తమ ప్రసంగాలను రద్దు చేసుకున్న సత్యం మందపాటి, విజయ సారధి జీడిగుంట, ఇతరులు అభినందనీయులు.

CATS కార్య నిర్వాహక సభ్యులు రవి బుజ్జా వందన సమర్పణ తో 10 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు దిగ్విజయంగా ముగిసింది.  భోజనం, వసతి, శ్రవణ సాధనాలు మొదలైన అన్ని సదుపాయాలూ అత్యంత సమర్థవంతంగా ఏర్పాట్లు చేసిన  CATS అధ్యక్షులు భాస్కర్ బొమ్మారెడ్డి,  CATS వ్యవస్థాపకులు నల్లు చిత్తరంజన్, సభ్యులు బద్రీనాథ్ చల్లా, సత్యజిత్ మారెడ్డి, సుదర్శన్ దేవిరెడ్డి, గోపాల్ నున్నా, శ్రీనివాస్ వూట్ల, అనిల్ నందికొండ, విజయ దొండేటి, రాజ్య లక్ష్మి, దుర్గాప్రసాద్ గంగిశెట్టి, సతీష్ వడ్డీ, రామచంద్ర ఏరుబండి, సలహా దారులు, సుధేష్ణ సోమ, జక్కంపూడి సుబ్బారాయుడు, రవి వేలూరి, ఇతర సహాయకులు ప్రతినిధులు ఎంతో ప్రశంసించారు. శాయి రాచకొండ,  సంధాన కర్త వంగూరి చిట్టెన్ రాజు ప్రత్యేక అభినందనలు, ప్రశంసలు అందుకున్నారు.

ఎందరో హితులను, సన్నిహితులను, కొత్త వారినీ కలుసుకుని లోతైన రూప కల్పన, సమర్థవంతమైన నిర్వహణ ద్వారా  అనిర్వచనీయమైన సాహిత్య వాతావరణం సృష్టించిన ఈ సదస్సు తెలుగు రాష్ట్రాలకి  దిశా నిర్దేశం చేసి ఆదర్సప్రాయంగా నిలుస్తుంది అని భారత దేశం నుంచి వచ్చిన లబ్ధ ప్రతిష్టులు, అమెరికా సాంస్కృతిక కార్యక్రమాలతో విసుగు చెందిన అమెరికా ప్రతినిధులు అభిప్రాయ పడ్డారు.  

సదస్సు ఫోటోలు, విడియోలు ఈ క్రింది లంకె లో చూడవచ్చును.  




Wednesday, July 19, 2017

10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు
&
మొట్ట మొదటి అమెరికా మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం
సెప్టెంబర్ 23-24, 2017 (శనివారం, ఆదివారం)
ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకూ
Greater Washington DC
Venue: To be Decided
మొదటి ప్రకటన &  ఆత్మీయ ఆహ్వానం

మీ అందరి ప్రోత్సాహంతో, 20 సంవత్సరాల క్రితం (1998) ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా దిగ్విజయంగా జరుగుతున్న ద్వై వార్షిక అఖిల అమెరికా తెలుగు సాహితీ సదస్సుల సత్సాంప్రదాయాన్ని అనుసరిస్తూ, మునునెన్నడూ లేనంత ఆసక్తికరంగా 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు అమెరికా రాజధాని వాషింగ్టన్ DC ప్రాంతంలో రాబోయే సెప్టెంబర్ 23-24, 2017 (శనివారం, ఆదివారం) తారీకులలో జరగబోతోంది.
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (Capitol Area Telugu Society) సంయుక్తంగా ఈ 10వ అమెరికా సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు.  
ఐదు దశాబ్దాలుగా ఉత్తర అమెరికా తెలుగు సాహిత్య వికాసం లో ప్రధాన పాత్ర పోషిస్తున్న మహిళా రచయితలకి ఒక ప్రత్యేక వేదిక కలిగించి మహిళా రచయితల సాహిత్య దృక్పథానికి పెద్ద పీట వెయ్యడం ఈ సాహితీ సదస్సులో ఒక ప్రధాన అంశం.
లాభాపేక్ష లేని ఈ జాతీయ స్థాయి 10వ అమెరికా సాహితీ సదస్సులో ఉత్తర అమెరికాలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ ఉన్న తెలుగు రచయితలు, పండితులు, విమర్శకులు, వక్తలు, భాషాభిమానులనూ, తెలుగు భాషా, సాహిత్యాల పురోగతిని ఆకాంక్షించే వారినీ, ఆనందించే వారందరినీ పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆసక్తి ఉన్న భారత, తదితర దేశాల ప్రతినిధులని స్వాగతిస్తున్నాం. మాతృదేశం నుంచి కొందరు ప్రముఖ సాహితీవేత్తలను ఆహ్వానించే ఉద్దేశ్యం ఉంది.
సదస్సు ప్రధానాశయాలు
·        గత యాభై ఏళ్ళకి పైగా అమెరికాలో వెల్లివిరుస్తున్న తెలుగు సాహిత్య ప్రక్రియలలో, ముఖ్యంగా అమెరికా తెలుగు కథ, కవితల ఆవిర్భావం, మారుతున్న పరిణామాలు, ప్రమాణాలు, ఆధునిక పోకడలు మొదలైన సాహిత్య పరమైన విషయాలు నెమరు వేసుకోవడం.
·        అమెరికా మహిళా రచయితల కోసం ఒక ప్రత్యేక వేదికకి రూప కల్పన చేసి వారి సాహిత్య కృషిని గుర్తించి, అమెరికా కథ, కవితల సృజనలో మహిళల అభిప్రాయాలు భావ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లో  ఉన్న  ఇబ్బందులు, పరిష్కారాల పై చర్చా వేదిక ఏర్పాటు చెయ్యడం.
·        కథా రచన పై నిష్ణాతులచేత శిక్షణా శిబిరం (వర్క్ షాప్)
·        స్వీయ రచనా పఠనం వేదిక లో రచయితలూ, కవులూ తమ రచనలను సహ సాహితీ ప్రియులకి స్వయంగా వినిపించే అవకాశాలు కలిగించడం.
·        సహ రచయితలను, సాహితీవేత్తలనూ, తెలుగు భాషా, సాహిత్యాభిమానులనూ వ్యక్తిగతంగా, ఆత్మీయ సాహిత్య వాతావరణంలో కలుసుకొని, సాహిత్య పరిచయాలను పెంచుకొనడం,
అదనపు ఆకర్షణలు
నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, నూతన పుస్తకావిష్కరణలు, పుస్తక విక్రయ శాల, సరదా సాహిత్య పోటీలు, అందరూ అప్పటికప్పుడు పాల్గొనే గొలుసు కథ, మరెన్నో....
రచయితలకు, వక్తలకు విన్నపం
ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో ప్రసంగించదల్చుకున్న వారు, స్వీయ రచనా విభాగంలో తమ రచనలను వినిపించదల్చుకున్నవారూ ఈ క్రింది నిర్వాహకులను  సంప్రదింఛండి. ప్రసంగాంశాలు ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక పోకడల దాకా తెలుగు భాష సాహిత్యాలకి పరిమితమై ఉండాలి. అమెరికాలో తెలుగు సాహిత్య పోకడల మీద ప్రసంగాలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. వాషింగ్టన్ DC పరిసర ప్రాంతాల (వర్జీనియా, మేరీలాండ్, పెన్సిల్వేనియా, న్యూ జెర్సీ, న్యూయార్క్ మొదలైనవి) రచయితలకు, వక్తలకు తమ ప్రతిభా పాటవాలకు  జాతీయ స్థాయిలో గుర్తింపుకి   ఈ 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఒక అరుదైన అవకాశం.
ఈ సదస్సు నిర్వహించబడే వేదిక చిరునామా, ప్రతినిధుల నమోదు, ప్రవేశ రుసుము, వసతి సదుపాయాలూ మొదలైన వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. ఈ లోగా సెప్టెంబర్ 23-24, 2017 తారీకులు ఈ 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సుకు కేటాయించమని అమెరికా రచయితలను, సాహితీ వేత్తలను,
భాషాభిమానులనీ కోరుతున్నాం. 
సంచాలకులు
వంగూరి చిట్టెన్ రాజు
Phone: 832 594 9054
&
భాస్కర్ బొమ్మారెడ్డి
అధ్యక్షులు
Capitol Area Telugu Society
Phone: 516 491 2812

E-mail: info@theuscats.org